విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై అవగాహనను పెంచుకోవాలి..
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 29: విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై ప్రతి ఒక్కరు అవగాహనను పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ క్షన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ (విజయవాడ) జి.సుమంత్ సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, ఆంద్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాణాలు అండ్ లేబులింగ్ అనే అంశంపై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ…