టిడ్కో లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, జూలై 18 : టిడ్కో లబ్ధిదారులకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమై టిడ్కో లబ్ధిదారులకు రుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75 శాతం నిర్మాణాలు పూర్తయిన వాటికి లోను రిలీజ్…